RBI Hikes Repo Rate: ఈఎంఐలు కడుతున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్! మరోసారి వడ్డీరేట్లు పెంచుతూ ఆర్బీఐ ప్రకటన, వరుసగా మూడోసారి రెపోరేటును పెంచిన కేంద్రబ్యాంకు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ తగ్గించేందుకు చర్యలంటూ ప్రకటన
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ (RBI Governor Shaktikanta Das) ప్రకటించారు. ఆర్బీఐ త్రైమాసిన ద్రవ్యపరపతి సమీక్షలో (monetary policy committee) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరుగనుంది. గడిచిన రెండు సమీక్షల్లో కూడా రెపోరేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
Mumbai, DEC 07: ఆర్బీఐ (RBI Raises Rates) మరోసారి రెపో రేటును పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ (RBI Governor Shaktikanta Das) ప్రకటించారు. ఆర్బీఐ త్రైమాసిన ద్రవ్యపరపతి సమీక్షలో (monetary policy committee) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరుగనుంది. గడిచిన రెండు సమీక్షల్లో కూడా రెపోరేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో వడ్డీరేట్లపై ప్రభావం కనిపించనుంది. గత మూడు రోజులుగా ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష కొనసాగుతోంది. ఇందులోని మెజార్టీ సభ్యులు రెపోరేటు (Repo rate) పెంపునకు మొగ్గు చూపినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అయితే దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ రిపోర్ట్లో ప్రస్తావించింది. ఆర్బీఐ డిసెంబరులో స్వల్పంగా వడ్డీ రేట్టు పెంచే అవకాశముందని, 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెరగొచ్చని, 6.25 శాతంగా రెపో రేటు ఉండొచ్చని ముందుగానే వివరించింది.
Monetary Policy Committee meeting met on 5th,6th &7th Dec, based on an assessment of macroeconomic situation & its outlook, MPC decided by a majority of 5 members out of 6 to increase policy repo rate by 35 basis points to 6.25% with immediate effect: RBI Governor Shaktikanta Das pic.twitter.com/wX40cSfduV
— ANI (@ANI) December 7, 2022
అంతకుముందు ఏప్రిల్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా 10 సార్లు రెపో రేటును యథాతథంగా ఉంచింది. అయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ రెపో రేటును తక్షణమే 40 బేసిస్ పాయింట్లు పెంచింది.ఆర్బీఐలో గతంలో మూడు సార్లు 50 bps పెంచింది. రెపో రేటు పెంపుతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు పెంచ అవకాశం ఉంది. వడ్డీ రేట్ పెరిగితే రుణగ్రహీతల ఈఎంఐ పెరగనుంది.
ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు (Stock Market) ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి నుంచే మార్కెట్లపై ఈ ఎఫెక్ట్ కనిపించింది. తాజాగా ఆర్బీఐ ప్రకటన తర్వాత మార్కెట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
(The above story first appeared on LatestLY on Dec 07, 2022 10:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

