Tamil Nadu: చింతపండులో మృతి చెందిన బల్లి, ఫిర్యాదు కోసం వెళితే అతని పైనే కేసు నమోదు చేసిన పోలీసులు, మనస్థాపంతో ఫిర్యాదుదారుడి కొడుకు ఆత్మహత్య, ఇది ప్రజాస్వామ్య హత్య అంటూ మండిపడిన అన్నాడీఎంకే

తన తండ్రిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారనే మనస్తాపంతో చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్త మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక నివేదికల ప్రకారం, తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణిలో అన్నాడీఎంకే కార్యకర్త నందన్ (70) రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ దుకాణంలో పంపిణీ చేసిన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్‌ (govt food packet) అందుకున్నాడు.

Tamil Nadu: చింతపండులో మృతి చెందిన బల్లి, ఫిర్యాదు కోసం వెళితే అతని పైనే కేసు నమోదు చేసిన పోలీసులు, మనస్థాపంతో ఫిర్యాదుదారుడి కొడుకు ఆత్మహత్య, ఇది ప్రజాస్వామ్య హత్య అంటూ మండిపడిన అన్నాడీఎంకే
Tamil Nadu man kills self after father booked for complaining (Photo-Twitter/ Edappadi K Palaniswami)

Chennai, Jan 13: తన తండ్రిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారనే మనస్తాపంతో చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్త మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక నివేదికల ప్రకారం, తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణిలో అన్నాడీఎంకే కార్యకర్త నందన్ (70) రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ దుకాణంలో పంపిణీ చేసిన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్‌ (govt food packet) అందుకున్నాడు. ఇంటికి వెళ్లి పరిశీలించగా చింతపండులో మృతి చెందిన బల్లి ఉన్నట్లు గుర్తించి చౌక దుకాణం సేల్స్‌ మ్యాన్‌కు ఫిర్యాదు చేశాడు.

అయితే దీనిపై సేల్స్‌మ్యాన్‌ శరవణన్‌ పట్టించుకోకపోవడంతో మీడియాకు తెలిపాడు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేసు నమోదు ( father booked for complaining about lizard ) చేశారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన అతని కుమారుడు కుప్పుస్వామి (35) మంగళవారం సాయంత్రం కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు.

జల్లికట్టుకు సై అన్న స్టాలిన్ సర్కారు, నిర్వహణపై పలు మార్గదర్శకాలను విడుదల చేసిన తమిళనాడు ప్రభుత్వం, పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతి

స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి (Tamil Nadu man kills self) చెందాడు. దీనికి నిరసనగా అన్నాడీఎంకే నేతలు రాస్తారోకో చేపట్టారు. దీనిపై తిరుత్తణిలో నిరసనలు చెలరేగాయి, తమ పార్టీ సభ్యునిపై తప్పుడు కేసు నమోదు చేశారని అన్నాడీఎంకే ప్రభుత్వం.. పోలీసులపై విరుచుకుపడింది.

Here's Edappadi K Palaniswami Tweet

అన్నా డీఎంకే అధినేత ఎడిప్పాడి పళని స్వామి ట్విట్టర్ లో ఈ ఘనటకు సంబంధించిన ట్విట్ చేశారు. ఇది ఆత్మహత్య కాదు, ప్రజాస్వామ్య హత్య అంటూ మండిపడ్డారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jan 13, 2022 12:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).