Tamil Nadu: విద్యార్థితో ప్రేమలో పడిన టీచర్, ఇద్దరూ పెళ్ళి చేసుకుని ఓ ఇంట్లో కాపురం, మైనర్ కుమారుడిని ప్రలోభపెట్టి ఆ మహిళ పెళ్లి చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడి తండ్రి
17 ఏళ్ల విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి మహిళను ఆమె ఇంటి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Chennai, December 30: 17 ఏళ్ల విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి మహిళను ఆమె ఇంటి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ (Tamil Nadu Teacher ) రెండేళ్ల క్రితం టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తున్న సమయంలో 15 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది.
విక్రమంగళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ పొంది తిరిగి వచ్చిన తర్వాత కూడా ఉపాధ్యాయురాలు విద్యార్థితో (17-Year-Old Minor Student in Perambalur) టచ్లో ఉంది. వివాహానంతరం యువకుడు తన కొత్త భార్యను ముంగిలపాడులోని ఖాళీగా ఉన్న అమ్మమ్మ వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉంది కానీ తాళం ఎక్కడ ఉందో యువకుడికి తెలుసు. దీంతో నూతన వధూవరులు ఇంటి తాళం తీసి లోపల ఏకాంతంలో గడిపారు.
ఇంతలో రాత్రి పొద్దుపోయినా పిల్లాడు ఇంటికి రాకపోవడంతో తల్లి ఫోన్ చేసింది. అంతే ఆ యువకుడు పెళ్లి చేసుకున్నానని (Teacher Held for Marrying Her 17-Year-Old) అమ్మమ్మ ఇంట్లో ఉన్నానని తెలిపాడు. రెండేళ్ల ప్రేమ వ్యవహారంపై తల్లిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే తల్లి మీ ఇద్దరూ పెళ్లిని అంగీకరించేది లేదని తెలిపింది. దీంతో భార్యాభర్తలు విషం తిని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే కుర్రాడు ఎందుకు మనసు మార్చుకుని ఇంటికి చేరాడు. మరోవైపు, కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో, తన మైనర్ కుమారుడిని ప్రలోభపెట్టి ఆ మహిళ పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ తండ్రి మహిళపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఈ ఆరోపణల ఆధారంగా మహిళను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కోర్టు అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
(The above story first appeared on LatestLY on Dec 30, 2021 10:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

