Tamil Nadu Shocker: విరాట్ కోహ్లీని తిట్టినందుకు స్నేహితుడ్నే పొడిచి చంపిన వ్యక్తి, విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ గొప్పోడంటూ వాదన, ఫుల్లుగా తాగి క్రికెట్ పై డిస్కషన్ పెట్టిన స్నేహితులు, మాట మాట పెరగడంతో బాటిల్తో పొడిచి హత్య
దాంతో కోపంతో ఊగిపోయిన విగ్నేష్ అతన్ని బాటిల్ తో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఉదయం ధర్మరాజ్ శవాన్ని గుర్తించిన పోలీసులు...కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విగ్నేష్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
Chennai, OCT 14: రోహిత్ శర్మ గొప్పా? లేక విరాట్ కోహ్లీ గొప్పా అని ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చిన డిస్కషన్ చివరకు ప్రాణాలు తీసుకునేవరకు వెళ్లింది. తమిళనాడులోని అరియలూరు జిల్లా మల్లూరులో (Mallur) ఈ ఘటన జరిగింది. కీలాపాలూర్ కు చెందిన విగ్నేష్ అనే యువకుడు ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. సింగపూర్ వెళ్లేందుకు వీసా కోసం ట్రై చేస్తున్నాడు. అతనికి కొంచెం నత్తి ఉంది. ఈ క్రమంలో ఊర్లోనే ఉంటూ అల్లరిగా తిరుగుతున్నాడు. అతనికి క్రికెట్ అంటే పిచ్చి. పైగా విరాట్ కోహ్లీ (Virat Kohli) అంటే చాలా అభిమానం. ఐపీఎల్ సీజన్ వచ్చిదంటే చాలు ఆర్సీబీ గెలవాలంటూ పూజలు చేస్తాడు. అయితే మంగళవారం రాత్రి స్థానికంగా తన స్నేహితుడు ధర్మరాజ్ అనే వ్యక్తి వచ్చిందంటే చాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ గెలవాలంటూ పిచ్చి అభిమానంతో ఊగిపోయే విగ్నేష్ అనే వ్యక్తి....తన స్నేహితుడ్ని హత్య చేశాడు.
మంగళవారం రాత్రి విగ్నేష్, ధర్మరాజ్ ఇద్దరూ కలిసి ఫుల్లుగా మద్యం తాగారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ గొప్ప అంటూ ధర్మరాజ్ తొలుత డిస్కషన్ మొదలు పెట్టాడు. అయితే విరాట్ కోహ్లీ గొప్ప అంటూ విగ్నేష్ (Vignesh) కూడా వాదించాడు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కూడా నీలాగే నత్తిది, ఎందుకూ పనికి రాదంటూ హేళన చేశాడు ధర్మరాజ్.
దాంతో కోపంతో ఊగిపోయిన విగ్నేష్ అతన్ని బాటిల్ తో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఉదయం ధర్మరాజ్ శవాన్ని గుర్తించిన పోలీసులు...కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విగ్నేష్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Oct 14, 2022 08:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

