Twins Married Same Man: ఆయనకిద్దరు! ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు, కేసు బుక్ చేసిన పోలీసులు, సినిమాను తలపిస్తున్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీ
కవలలైన పింకీ, రింకీ కుటుంబంతో అతడికి పరిచయం ఏర్పడింది. ఒకసారి ఆ యువతులతోపాటు ఆమె తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఈ సందర్భంగా అతుల్ వారిని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నాటి నుంచి రింకీ, పింకీకి అతడు మరింత దగ్గరయ్యాడు.
Solapur, DEC 04: కవలలైన ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Clip) అయ్యింది. మహారాష్ట్రలోని షోలాపూర్ (Solapur) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కవల సోదరీమణులైన పింకీ (Pinky), రింకీ (Rinky) ముంబైలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత కాలం కిందట వారి తండ్రి చనిపోయాడు. అయితే చిన్నప్పటి నుంచి నివసిస్తున్న ఇంటిలో తల్లితో కలిసి ఉంటున్నారు. కాగా, షోలాపూర్ జిల్లాలోని అక్లూజ్ (Akluz) గ్రామానికి చెందిన అతుల్ (Athul) అనే వ్యక్తి ముంబైలో ట్రావెల్ బిజినెస్ చేస్తున్నాడు. చూసేందుకు ఒకేలా ఉండే కవలలైన పింకీ, రింకీ కుటుంబంతో అతడికి పరిచయం ఏర్పడింది. ఒకసారి ఆ యువతులతోపాటు ఆమె తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఈ సందర్భంగా అతుల్ వారిని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నాటి నుంచి రింకీ, పింకీకి అతడు మరింత దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో చిన్నప్పటి నుంచి కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న ఆ కవల సోదరీమణులు అతుల్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. దీంతో అతుల్ సొంత గ్రామమైన అక్లూజ్లో శుక్రవారం వారి పెళ్లి జరిగింది.
अकलूज तालुका माळशिरस येथे दोन जुळ्या बहिणींनी एकाच मुलाशी केला विवाह. कांदिवलीमधील उच्च शिक्षित पिंकी आणि रिंकी या जुळ्या बहिणी आहेत.#Solapur #Mumbai #Marriage #MaharashtraNews #News18Lokmat pic.twitter.com/XF2eAt9dcR
— News18Lokmat (@News18lokmat) December 3, 2022
ఈ సందర్భంగా ఇద్దరు వధువులు ఒకే పూల దండను వరుడి మెడలో వేశారు. మరోవైపు కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని పెళ్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఈ పెళ్లి చెల్లుతుందా అని ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. మీమ్స్, ఇమోజీలతో మరి కొందరు జోకులు వేశారు.
దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి వీడియోల ఆధారంగా, వరుడిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వరుడు అతుల్ పై అక్లూజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం నాన్ కాగ్నిజబుల్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Dec 04, 2022 10:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

