Uttar Pradesh: యూపీ పోలీసుల అత్యుత్సాహం, పోలీస్ స్టేషన్లో యువకులను లాఠీలతో చితకబాదారు, వీడియో వైరల్ కావడంతో.. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక కోర్టు
Men Beaten By Cops in Saharanpur Viral Video Leave Jail As Court Clears Them (Photo-Video Grab)

ఉత్తర ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై యూపీ పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ అల్లర్లలో పాల్గొన్నారని ఎనిమిది మంది యువకులను పోలీసులు అరెస్ట్‌ చేసి.. లాకప్‌లో లాఠీలతో (8 Men Beaten By Cops) చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video Leave Jail ) మారింది. ఈ వీడియో బయటకు రావడంతో బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన స్థానిక కోర్టు వారు దోషులు అనేందుకు సాక్ష్యం చూపాలని కోరారు.

వేరే వ్యక్తితో ప్రియురాలి పెళ్లి, లవర్ ముందే పెట్రోల్ పోసుకుని కాల్చుకున్న ప్రియుడు, అనంతరం ఆమెను హత్తుకునే ప్రయత్నం, చికిత్స పొందుతూ బాధితుడు మృతి

అయితే అరెస్ట్‌ చేసిన 8 మంది అలర్లల్లో పాల్గొన్నారనేందుకు సాక్ష్యాలను పోలీసులు కోర్టులో రుజువు చేయలేకపోయారు. దీంతో పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేయాలని ఆదేశించింది. ఇక, పోలీసులు దారుణంగా కొట్టడంతో మహ్మద్‌ అలీ అనే వ్యక్తి చేయి విరిగిపోయింది. కాగా షహరాన్‌పూర్‌లో (Saharanpur) పెద్దఎత్తున అల్లర్ల కారణంగా 300 మందికి పైగా వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

Here's Viral Video

పోలీసులు లాఠీలతో కొట్టిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే షలభ్ మణి త్రిపాఠి స్పందించారు. ఈ వీడియోకు ''అల్లరిమూకకు రిటర్న్ గిఫ్ట్'' అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ‍్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.