Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చార్‌బాగ్ రైల్వే స్టేషన్ నుండి ఐదేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. రైల్వే యార్డులో ఆగి ఉన్న రైలులో ఈ చిన్నారి మృతదేహం లభ్యమైంది,

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Sodomised (Photo-rep/ANI)

లక్నో, డిసెంబర్ 17 : యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చార్‌బాగ్ రైల్వే స్టేషన్ నుండి ఐదేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. రైల్వే యార్డులో ఆగి ఉన్న రైలులో ఈ చిన్నారి మృతదేహం లభ్యమైంది, హత్యకు ముందు బాలుడు సోడొమైజ్ ( ఓ పార్టుపై లైంగిక దాడి) చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆదివారం రాత్రి రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ ప్రతాప్‌గఢ్‌కు వెళ్లేందుకు తన కుమారుడితో కలిసి చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుందని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 గంటలకు, మహిళ నిద్రలోకి జారుకుంది. లేచి చూసేసరికి ఆమె కుమారుడు కనిపించకుండా పోయాడు.ఆ తర్వాత ఆమె 1 గంటలకు ప్రభుత్వ రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. ఓ వ్యక్తి చిన్నారిని తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని వారు తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..ప్రేమ, 8 నెలల సహజీవనం, చివరకు అడవిలో వదిలేసిన యువకుడు..వీడియో ఇదిగో

సోమవారం ఉదయం రైల్వే యార్డులో ఆగి ఉన్న రైలు నుంచి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడిని లఖింపూర్‌కు చెందిన ఇబ్రహీంగా గుర్తించిన పోలీసులు సాయంత్రం తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. "మేము కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసాము. ఉత్తర రైల్వే, ఈశాన్య రైల్వేల నుండి సిసిటివి ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇది ఒక భయంకరమైన సంఘటన. మహిళ సంఘటన గురించి ఎటువంటి క్లూ ఇవ్వలేకపోయింది," అని రైల్వే ఏడీజీ ప్రకాష్ డి చెప్పారు. నిందితుడు చిన్నారిని తీసుకెళ్లి రైల్వే కోచ్‌లో వదిలేశాడు. మేము నేరస్థుడిని నిన్న అరెస్టు చేసాము," అని ఆయన చెప్పాడు.

ఆ చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాల గుర్తులు ఉన్నాయని, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించాయని తెలిపారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తి అప్పటికే వెయిటింగ్ రూమ్‌లో ఉన్నాడని, మహిళతో పాటు ఆమె కుమారుడిపై కాసేపు కన్నేసినట్లు విచారణలో తేలింది. ఆ మహిళతో స్నేహం చేసేందుకు ఆ వ్యక్తి ఆమెతో కలిసి ఆహారం కూడా తిన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని జీఆర్పీ ఫుటేజీల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడి సహచరులు కూడా అక్కడే ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు.

Women and Child Helpline Numbers:

Childline India – 1098; Women’s Helpline – 181; National Commission for Women Helpline – 112; National Commission for Women Helpline Against Violence – 7827170170; Police Women / Senior Citizen Helpline – 1091/ 1291; Missing Child and Women – 1094.

(The above story first appeared on LatestLY on Dec 17, 2024 09:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).