Uttar Pradesh Horror: యూపీలో ఓ కసాయి తల్లి దారుణం.. ఆరేళ్ల కూతురు ప్రైవేట్ భాగాలపై సలసల కాగే నూనె పోసింది, నొప్పితో విలవిలలాడిన బాలిక, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
Physical Torture (credit - IANS)

Lucknow, July 14: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన దత్త కుమార్తెను (6-Year-Old Adopted Daughter) దారుణంగా హింసించింది. ఆ చిన్నారి ప్రైవేట్ భాగాల్లో కాలుతున్న నూనె పోసి చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటన యూపీలోని లక్నోలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 35 ఏళ్ల మహిళ పూనమ్‌ తన భర్త అజయ్ కుమార్ తో కలిసి ఠాకూర్‌గంజ్‌లో నివసిస్తోంది. వీరిద్దరికి పిల్లలు లేకపోవడంతో ఓ పాపను దత్తత తీసుకున్నారు. ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ప్రతి రోజూ చిత్రహింసలు పెట్టడం ఆ తల్లి (Woman in Lucknow) స్టార్ట్ చేసింది. ఆమె భర్త ఫుడ్ ట్రక్ నడుపుతున్నాడు. అతను డ్యూటీకి వెళ్లినప్పుడల్లా ఈ కసాయి తల్లి ఆమెను చిత్రహింసలకు గురిచేసేది.

మైనర్‌పై తెగబడిన నలుగురు కామాంధులు, బాలిక శీలానికి లక్ష రూపాయలు వెలకట్టిన గ్రామ పెద్దలు, పోలీసులకు తెలియడంతో నిందితులంతా కటకటాల్లోకి

రోజు లాగే బుధవారం కూడా అతను పనికివెళ్లగా.. ఈ 35 ఏళ్ల మహిళ తన ఆరేళ్ల దత్తపుత్రికపై సలసల కాగే నూనె ( Hot Oil) పోసింది. ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పడటంతో ఆ చిన్నారి నొప్పితో అల్లాడిపోయింది. డ్యూటీ నుంచి వచ్చిన దత్త తండ్రి ఈ దారుణాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం అర్థరాత్రి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాలికను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.