Weather Update: రుతుపవనాల ప్రభావం, పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, దేశం మొత్తాన్ని రుతు పవనాలు కవర్ చేశాయని తెలిపిన భారత వాతావరణ శాఖ
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు (IMD warns of heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలపై రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
New Delhi, June 10: నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు (IMD warns of heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలపై రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. మే 29వతేదీన కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు దక్షిణ, మధ్య అరేబియా సముద్రం, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. మే 31 నుంచి జూన్ 7వతేదీల మధ్య రుతుపవనాలు మొత్తం ఈశాన్య ప్రాంతాలను కవర్ చేశాయని సీనియర్ ఐఎండీ ( IMD) శాస్త్రవేత్త ఆర్కె జెనామణి తెలిపారు.
రుతుపవనాలు వచ్చే రెండు రోజుల్లో మహారాష్ట్రకు చేరుకుని, ఆ తర్వాత రెండు రోజుల్లో ముంబయిని కవర్ చేసే అవకాశం ఉందని చెప్పారు. బలమైన రుతుపవనాల ప్రభావం వల్ల బలమైన గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. జూన్ 10-11 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్లో,రాబోయే ఐదు రోజుల్లో అసోం, మేఘాలయలో భారీ వర్షాలు (204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇది జూన్ 16,జూన్ 22వతేదీల మధ్య రుతుపవనాలు ఉత్తరప్రదేశ్కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది.
జూన్ 8న జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, జూన్ 08, 09 తేదీల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా-ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని వివిక్త ప్రదేశాలలో వేడి తరంగాల పరిస్థితులు కొనసాగనున్నాయి. కాగా, నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్తముందే పలకరించాయి. సాధారణంగా జూన్ ఒకటిన కేరళలో ప్రవేశించే 'నైరుతి' మూడు రోజుల ముందుగానే వచ్చేసిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మే 29న కేరళను రుతుపవనాలు తాకినట్లు వాతావరణ విభాగ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అక్కడే స్థిరంగా ఉండి 4 రోజులకు కర్ణాటక, తమిళనాడును తాకాయని పేర్కొన్నారు.
శనివారం మధ్యాహ్నంలోగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ను నైరుతి రుతుపవనాలు (Monsoon) పలకరించనున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రంతో పాటు పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళకు మూడు రోజులు ముందుగానే వచ్చిన రుతుపవనాలు జూన్ 7న రాష్ట్రానికి విస్తరించాల్సి ఉన్నా.. వాతావరణం అనుకూలించక జాప్యమైంది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి ఆవరించి ఉన్నందున శుక్ర, శని వారాల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. దక్షిణ ఆంధ్రలో ఒకట్రెండు చోట్ల వడగాడ్పులు వీయొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.
(The above story first appeared on LatestLY on Jun 10, 2022 04:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

