Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు
బెంగళూరులోని నందిని లేఅవుట్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి (Egg Attack On BJP MLA Munirathna) చేశారు.ఈ దాడికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు
Bengaluru, Dec 27: బెంగళూరులోని నందిని లేఅవుట్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి (Egg Attack On BJP MLA Munirathna) చేశారు.ఈ దాడికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్, వారి సహచరులతో కలిసి నాపై దాడికి పాల్పడ్డారని మునిరత్న ఆరోపించారు.
"ఇది నన్ను చంపే ప్రయత్నమే. నన్ను అంతం చేసేందుకు దాదాపు 150 మందిని తీసుకొచ్చారు. నా మద్దతుదారులు, పోలీసులు లేకుంటే నన్ను చంపి ఉండేవారు. ఈ దాడిలో డికె శివకుమార్, డికె సురేష్, హనుమంతరాయప్ప, మరికొంతమంది ప్రమేయం ఉంది" అని ఆయన ఆరోపించారు. 1924 భారత జాతీయ కాంగ్రెస్ సెషన్ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన సన్నాహాల కోసం బెలగావిలో ఉన్న శివకుమార్ ఈ వాదనలను ఖండించారు.
నేను సన్నాహాల్లో బిజీగా ఉన్నాను. ఈ ఆరోపణలు నిరాధారమైనవి," అని అన్నారు. అదేవిధంగా మునిరత్న ఆరోపణలను డీకే సురేష్ తోసిపుచ్చారు, ఎమ్మెల్యేనే (BJP MLA Munirathna) తనపై దాడి చేయించుకున్నారని సూచించారు.
బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి,
A group of miscreants threw eggs at #BJP MLA #Munirathna during a BJP programme of celebrating the birth anniversary of #Vajpayee in #Bengaluru.
Police have detained 3 persons in connection with the incident.
MLA #Muniratna alleges #Congress workers attacked him.
The… pic.twitter.com/0SliHapHr6
— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024
ఆయన తన ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించి ఈ డ్రామాతో దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని సురేష్ అన్నారు. కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర అరెస్టులను ధృవీకరించారు. "ముగ్గురిని అరెస్టు చేశాం. వారు ఎవరో, ఎందుకు చేశారో గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది" అని ఆయన విలేకరులకు తెలిపారు.
బీజేపీ నేతల నుంచి ఖండనలు వెల్లువెత్తుతున్నాయి
ఈ దాడిపై బీజేపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది మొత్తం రాష్ట్రానికే అవమానకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడి మునిరత్నానికే కాదు, రాష్ట్రమంతటికీ అవమానకరమని, మీరు (కాంగ్రెస్) అధికారంలో ఉన్నందుకే ప్రజలపై దాడులు చేస్తున్నారని, ప్రజాప్రతినిధిపై దాడి చేయడం అత్యంత ఖండనీయమని అన్నారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ మంత్రి సిటి రవి కూడా ఈ సంఘటనను ఖండించారు, ప్రజా ప్రతినిధులకు జవాబుదారీతనం మరియు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. రాజకీయ తుఫాను మధ్య, మునిరత్న న్యాయపరమైన ఇబ్బందులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు సహా పలు పోలీసు కేసులు ఉండగా, ఇటీవల ఆయన బెయిల్పై విడుదలయ్యారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

