Assembly Elections 2024: మళ్లీ మోగిన ఎన్నికల నగారా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
New Delhi, Oct 15: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుపనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.
మహారాష్ట్ర (Maharashtra)లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 22న వెలువడుతుంది. నామినేషన్ల గడవు అక్టోబర్ 29వ తేదీతో ముగుస్తుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 30న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 4వ తేదీతో ముగుస్తుంది. నవంబర్ 25వ తేదీలోగా ఎన్నికలు ముగియాల్సి ఉంటుంది.నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు (Jharkhand Assembly Elections) కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిని 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి. ఇక నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇక వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది.
మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్
అక్టోబర్ 22న నోటిఫికేషన్
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 29
అక్టోబర్ 30న స్క్రూటినీ
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్ 4
నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
నవంబర్ 23న ఫలితాల వెల్లడి
రెండు విడతల్లో జార్ఖండ్ ఎన్నికల పోలింగ్
తొలి దశ పోలింగ్ వివరాలు
అక్టోబర్ 18న నోటిఫికేషన్
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 25
అక్టోబర్ 28న స్క్రూటినీ
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 30
నవంబర్ 13న పోలింగ్
నవంబర్ 23న ఫలితాల వెల్లడి
రెండో దశ పోలింగ్ వివరాలు
అక్టోబర్ 22న నోటిఫికేషన్
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 29
అక్టోబర్ 30న స్క్రూటినీ
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 1
నవంబర్ 20న పోలింగ్
నవంబర్ 23న ఫలితాల వెల్లడి
రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. హర్యానా, జమ్ముకశ్మీర్లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్లో ఎలాంటి హింస లేకుండా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

