Redmi Note 7S Explodes: పేలిన రెడ్‌మీ నోట్ 7ఎస్, కస్టమర్ తప్పిదం వల్లే ఫోన్ పేలిందన్న కస్టమర్ కేర్, కనీసం ఛార్జింగ్ కూడా పెట్టలేదన్న కస్టమర్

చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లు పేలిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటిదే మరొక ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఫోన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

Redmi Note 7S Explodes: పేలిన రెడ్‌మీ నోట్ 7ఎస్, కస్టమర్ తప్పిదం వల్లే ఫోన్ పేలిందన్న కస్టమర్ కేర్, కనీసం ఛార్జింగ్ కూడా పెట్టలేదన్న కస్టమర్
Redmi Note 7S allegedly explodes; company says fire 'customer induced (Photo-Twitter)

Mumbai, Novemebr 22: చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లు పేలిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటిదే మరొక ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఫోన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ముంబైలో నివాసం ఉండే ఈశ్వర్ చౌహాన్ గత అక్టోబర్ నెలలో ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)లో షియోమీ రెడ్‌మీ నోట్ 7ఎస్ (Redmi Note 7S ) స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు.

అయితే నవంబర్ 2వ తేదీన అతని ఇంట్లో టేబుల్ మీద ఉంచిన‌ ఆ ఫోన్ దానంతట అదే అకస్మాత్తుగా పేలింది. ఈ క్రమంలో చౌహాన్ షియోమీ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా వారు ఆ ఫోన్‌ను పరిశీలించి కస్టమర్ తప్పిదం వల్లే ఫోన్ పేలి ఉంటుందని చెప్పారు.

షియోమి ఇండియా రిప్లై

అయితే ఈశ్వర్ చౌహాన్ మాత్రం తాను ఫోన్‌ను టేబుల్ మీద పెట్టానని, అకస్మాత్తుగా అందులో నుంచి కాలిపోయిన వాసన వచ్చిందని, ఆ తరువాత వెంటనే పేలిందని(Redmi Note 7S explodes), తాను ఫోన్‌ను కింద పడేయలేదని, కనీసం దానికి చార్జింగ్ కూడా పెట్టలేదని తెలిపాడు.

ఫ్లిప్‌కార్ట్ రిప్లై

అయితే షియోమీ అతని వాదనను పట్టించుకోలేదు. కానీ.. పేలిన ఆ ఫోన్‌కు బదులుగా ఇంకొక ఫోన్‌ను షియోమీ అతనికి ఇచ్చిందా, లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే కస్టమర్ ట్విట్టర్లో ట్వీట్ చేసిన ట్వీట్ కనపడటం లేదు. దానికి షియోమి ఇండియా అలాగే ఫ్లిప్ కార్ట్ రిప్లై ఇచ్చాయి.

(The above story first appeared on LatestLY on Nov 22, 2019 11:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).