
Jaipur, Dec 20: రాజస్థాన్ (Rajasthan) లోని జైపూర్ లో (Jaipur) ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం ఉదయం అజ్మీర్ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న ఓ సీఎన్ జీ ట్యాంకర్ ను మరో ట్రక్ వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ లో మంటలు చెలరేగడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Here's Video:
జైపూర్ లో భారీ అగ్ని ప్రమాదం....ఐదుగురు సజీవ దహనం
జైపూర్ లోని భన్క్రోట ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా CNG ట్యాంకర్ పేలింది
ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు
మంటల ధాటికి పక్కనే ఉన్న ఇతర వాహనాలు కూడా
కాలిబూడిదయ్యాయి pic.twitter.com/VK6FjYhsO3
— BIG TV Breaking News (@bigtvtelugu) December 20, 2024
22 ఫైర్ ఇంజిన్ల సాయంతో..
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 22 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
అవమానం వల్లే అశ్విన్ వీడ్కోలు.. తండ్రి సంచలన ఆరోపణలు.. దిద్దుబాటుకు దిగిన స్పిన్నర్ (వీడియో)