Smartphone Users Checking Mobile: పొద్దున్న లేవగానే స్మార్ట్‌ ఫోన్‌ చూడటమే.. లేచిన 15 నిమిషాలకే ఫోన్‌ చూస్తున్న 84 శాతం మంది భారతీయులు.. తాజా అధ్యయనంలో వెల్లడి

స్మార్ట్ ఫోన్ (Smart Phone) వ్యసనంలా మారింది. దీన్ని రుజువు చేస్తూ దేశంలోని స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్‌ (Check) చేస్తున్నట్టు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడించింది.

Smartphone Users Checking Mobile: పొద్దున్న లేవగానే స్మార్ట్‌ ఫోన్‌ చూడటమే.. లేచిన 15 నిమిషాలకే ఫోన్‌ చూస్తున్న 84 శాతం మంది భారతీయులు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Smartphone Users Checking Mobile (Credits: X)

Newdelhi, Feb 17: స్మార్ట్ ఫోన్ (Smart Phone) వ్యసనంలా మారింది. దీన్ని రుజువు చేస్తూ దేశంలోని స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్‌ (Check) చేస్తున్నట్టు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడించింది. మేల్కొని  ఉన్నపుడు 31 శాతం సమయాన్ని స్మార్ట్‌ ఫోన్లతోనే గడుపుతారని, రోజుకు సగటున 80 సార్లు తమ ఫోన్లను చెక్‌ చేస్తారని తెలిపింది. కంటెంట్‌ ను స్ట్రీమింగ్‌ చేయడానికి దాదాపు 50 శాతం సమయాన్ని వెచ్చిస్తారని చెప్పింది.

Garlic Fields Monitored Through CCTV: భగ్గుమంటున్న ఎల్లిగడ్డ ధరలు.. కిలో రూ.500కు చేరిన వైనం.. పెరుగుతున్న దొంగతనాలు.. పొలాల్లో సీసీ కెమెరాలు పెడుతున్న మధ్యప్రదేశ్ రైతులు

డబుల్ కంటే ఎక్కువ

స్మార్ట్‌ ఫోన్లతో గడిపే సమయం 14 ఏండ్ల వ్యవధిలో డబుల్ అయినట్టు నివేదిక వెల్లడించింది. 2010లో దాదాపు రోజుకు రెండు గంటలపాటు స్మార్ట్‌ ఫోన్లతో మనుషులు గడిపేవారని.. అయితే, ఇప్పుడు ఇది 4.9 గంటలకు పెరిగిందని తెలిపింది.

Gruha Jyothi-Aadhar Link: ఆధార్‌ ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిచ్చే ‘గృహజ్యోతి’ స్కీమ్.. విద్యుత్తు కనెక్షన్‌ నంబర్‌ కు ఆధార్‌ తో అనుసంధానం తప్పనిసరి.. ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.. మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

(The above story first appeared on LatestLY on Feb 17, 2024 09:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).