Corona Store in Kerala: ఏడు ఏళ్ల క్రితమే కేరళలో కరోనా, తన దుకాణానికి కరోనా అనిపేరు పెట్టుకున్న కొట్టాయమ్ వ్యాపారవేత్త, జ్యూయెలరీ షాపులో 31 మందికి కరోనావైరస్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అనే పేరు ఇప్పుడు జన జీవనాన్ని వణికిస్తోంది. అయితే ఈ పేరు 7 సంవత్సరాల క్రితమే కేరళలో (Corona store opened 7 years ago) నమోదయింది. ఏడు సంవత్సరాల క్రితం, కేరళకు చెందిన జార్జ్ అనే వ్యాపారవేత్త కొట్టాయం యొక్క కళాతిప్పడి ప్రాంతంలో (Kerala's Kottayam) తన దుకాణానికి 'కరోనా' అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. తద్వారా తన వ్యాపారం వృద్ధి చెందుతోందని వ్యాపారి జార్జ్ (George) తెలిపారు.
Kottayam, Nov 19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా అనే పేరు ఇప్పుడు జన జీవనాన్ని వణికిస్తోంది. అయితే ఈ పేరు 7 సంవత్సరాల క్రితమే కేరళలో (Corona store opened 7 years ago) నమోదయింది. ఏడు సంవత్సరాల క్రితం, కేరళకు చెందిన జార్జ్ అనే వ్యాపారవేత్త కొట్టాయం యొక్క కళాతిప్పడి ప్రాంతంలో (Kerala's Kottayam) తన దుకాణానికి 'కరోనా' అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. తద్వారా తన వ్యాపారం వృద్ధి చెందుతోందని వ్యాపారి జార్జ్ (George) తెలిపారు.
కలతిప్పడిలో ఉన్న అతను మొక్కలు, కుండలు, మొక్కలు, దీపాలు, ఇతర సామగ్రిని విక్రయిస్తాడు. ‘కరోనా’ అనే పదానికి లాటిన్ భాషలో ‘కిరీటం’ అని అర్థమని జార్జ్ తెలిపాడు. ఇంటీరియర్ అలంకరణ వస్తువులతో వ్యవహరించేటప్పుడు అతను తన దుకాణానికి అదే పేరు పెట్టాడు. అయితే ఆయనకు ఈ పేరు ప్రపంచాన్ని వణికిస్తుందని అప్పుడు తెలియలేదు. ఇప్పుడు అతని వ్యాపారాన్ని ఇది లాభాల వైపు పరుగులు పెట్టిస్తోంది. ప్రత్యేకమైన సేకరణను ప్రదర్శించే మొక్కలు మరియు దీపాలతో ఈ దుకాణం అలంకరించబడింది.
జ్యూయెలరీ షాపులో 31 మందికి కరోనా వైరస్
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఉన్న ఓ జ్యూయెలరీ షాపులో 31 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ నగరంలో అప్రమత్తత ప్రకటించారు. తాత్కాలికంగా ఆనంద్ జ్యూయెలరీ షాపును మూసి .. డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నారు. అయితే ఈ స్టోర్ను గత వారం రోజుల నుంచి విజిట్ చేసిన వారి గురించి అధికారులు ట్రేసింగ్ మొదలుపెట్టారు.
వైరస్ సంక్రమించిన ఉద్యోగులు, కస్టమర్ల గురించి ట్రేసింగ్ ప్రారంభించామని, వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్నాయో లేదో గమనిస్తున్నామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాదియా తెలిపారు. మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు 1.86 లక్షల మంది కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్గా తేలారు. ఆ రాష్ట్రంలో సుమారు 1200 మంది మరణించారు. నిన్న ఒక్క రోజే ఆ రాష్ట్రంలో కొత్త 194 మందికి వైరస్ సోకింది.
(The above story first appeared on LatestLY on Nov 19, 2020 01:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

