Train (Credits: Wikimedia commons)

Newdelhi, June 15: తాగిన మత్తులో ఉన్న ఓ సైనికుడు (Drunk Soldier Pees) రైలులో (Train) ప్రయాణిస్తూ  తన బెర్త్‌ పై మూత్ర విసర్జన చేశాడు. ఆ మూత్రం తన బెర్త్‌ పై పడిందని ఓ మహిళ ఆరోపించింది. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి చత్తీస్‌ గఢ్‌ లోని దుర్గ్ వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ ప్రెస్ రైలులో జరిగిందీ ఘటన. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగినట్టు సదరు మహిళ పేర్కొన్నారు. ఈ విషయమై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని మహిళ ఆరోపించారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త  వైరల్ గా మారింది.

రైలులో మంటలు అంటుకున్నాయని పుకార్లు షికార్లు.. భయంతో నడుస్తున్న రైలు నుంచి దూకిన పలువురు ప్రయాణికులు.. ఎదురుగా మరో ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు ప్రయాణికుల మృతి.. ఝార్ఖండ్‌ లో ఘోరం

ఖండించిన ఆర్ఫీఎఫ్ అధికారులు

మహిళ ఆరోపణలను ఆర్ఫీఎఫ్ అధికారులు ఖండించారు. మహిళ ఫిర్యాదుపై  తాము వెంటనే స్పందించామని, బాధిత మహిళ తన సీట్లో కనిపించలేదని పేర్కొన్నారు. సైనికుడు మాత్రం పూర్తిగా తాగిన మత్తులో నిద్రపోతున్నాడని తెలిపారు.

ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టబోతుందని వార్తలు.. ఇప్పటికైతే ప్రతిపాదనేదీ లేదన్న బీమా దిగ్గజం