Facebook Love Story: భర్తను వదిలేసి ఫేస్‌బుక్‌ ప్రియుడుతో వెళ్లిపోయిన భార్య, తీరా పోలీసుల దగ్గరకు భర్త పంచాయితీ కోసం వెళితే..

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ మహిళ ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. లక్షల విలువైన నగదు, బంగారం దొంగిలించిందని భార్య ఆరోపిస్తూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Facebook Love Story: భర్తను వదిలేసి ఫేస్‌బుక్‌ ప్రియుడుతో వెళ్లిపోయిన భార్య, తీరా పోలీసుల దగ్గరకు భర్త పంచాయితీ కోసం వెళితే..
representational picture of Hindu wedding. (Photo credits: Pixabay)

Srinagar, Jan 9: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ మహిళ ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. లక్షల విలువైన నగదు, బంగారం దొంగిలించిందని భార్య ఆరోపిస్తూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సోషల్ మీడియా ద్వారా ప్రేమికుడు తన భార్యను తప్పుదోవ పట్టించి తీసుకెళ్లాడని భర్త ఆరోపించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన అబిరాల్ అనే మహిళ 2017లో పంజాబ్‌లోని మొహాలీకి చెందిన వినోద్ కుమార్‌ను వివాహం చేసుకుంది.అయితే, ఆ తర్వాత రాయ్‌బరేలీకి చెందిన ఫైజాన్ అహ్మద్‌తో ఫేస్ బుక్ ద్వారా ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. డిసెంబర్ 2024లో, అబిరాల్ తన భర్తను విడిచిపెట్టి, తన ప్రేమికుడు అహ్మద్‌ను కలవడానికి వెళ్లింది. రెండు రోజుల తరువాత ఆమె అతనిని వివాహం చేసుకుంది.

పూణెలో దారుణం..సహ ఉద్యోగి శుభదని దారుణంగా హత్య చేసిన ఉద్యోగి..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

పెళ్లి విషయం తెలుసుకున్న భర్త మంగళవారం రాయ్‌బరేలీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అహ్మద్ తన భార్యను తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు.ఆమె వెళుతూ బంగారం, మొబైల్ ఫోన్, రూ.2 లక్షల నగదు సహా రూ.5 లక్షల విలువైన వస్తువులు తీసుకెళ్లిందని ఆరోపించారు.అయితే ప్రియుడితోనే తాను ఉంటానని పోలీసులకు అభిరాల్‌ చెప్పింది. దీంతో ఆమె భర్త ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Aug 17, 2649 05:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).