Man Marries 2 Sisters: ఇదో విచిత్ర పెళ్లి..అక్కతో పాటు చెల్లికి తాళి కట్టిన వరుడు ఉమాపతి, చెల్లి మైనర్ కావడంతో అరెస్ట్, వరుడు సహా ఏడుగురిపై కేసు నమోదు, కర్ణాటకలోని కోలార్లో ఘటన
మీరు చదివేది సినిమా స్టోరి కాదు. నిజంగా జరిగిన కథ (Karnataka’s Kolar Bizarre Incident). కర్ణాటక కోలార్లోని ఒక వ్యక్తి కురుదుమళే ఆలయంలో (Kurudumale temple) జరిగిన ఒకే వివాహ కార్యక్రమంలో సోదరీమణులు అయిన ఇద్దరు మహిళలను వివాహం (2 Sisters Marry The Same Man) చేసుకున్నాడు. మే 7 న జరిగిన ఈ వివాహం అప్పటి నుండి పట్టణంలో చర్చగా మారింది.
మీరు చదివేది సినిమా స్టోరి కాదు. నిజంగా జరిగిన కథ (Karnataka’s Kolar Bizarre Incident). కర్ణాటక కోలార్లోని ఒక వ్యక్తి కురుదుమళే ఆలయంలో (Kurudumale temple) జరిగిన ఒకే వివాహ కార్యక్రమంలో సోదరీమణులు అయిన ఇద్దరు మహిళలను వివాహం (2 Sisters Marry The Same Man) చేసుకున్నాడు. మే 7 న జరిగిన ఈ వివాహం అప్పటి నుండి పట్టణంలో చర్చగా మారింది. కాగా ఈ సంఘటన యొక్క వీడియో శనివారం వైరల్ అయ్యింది. అతను సోదరీమణులను ఎందుకు వివాహం చేసుకున్నాడు అని ఆలోచిస్తున్నారా? దీనికి పెద్ద కథ ఉంది.
ఘటన వివరాల్లోకెళితే.... కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని తిమ్మరావుతనహళ్ళి గ్రామ పంచాయతీ వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతుల కుమార్తెలు సుప్రియ, లలితలు. చెల్లెలు లలిత మూగ–బధిర. ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని అక్క సుప్రియ బాధపడుతూ ఉండేది. ఈ తరుణంలోనే సుప్రియకు బాగేపల్లికి చెందిన ఉమాపతి (Umapathy) అనే యువకునితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు ఈ విషయంపై చర్చించిన తరువాత, అతను ఇద్దరి సోదరీమణులను వివాహం చేసుకోవాలని నిర్ణయించారు.
ఈ నెల 7వ తేదీన పెళ్లి మండపంలో వరుడు తాళి కట్టబోతుండగా సుప్రియ తన చెల్లెలి గురించి భర్తకు చెప్పింది. పెద్దల అనుమతితో ఉమాపతి ఇద్దరికీ మాంగళ్యధారణ చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు వధువు లలితకు ఇంకా 18 ఏళ్లు దాటలేదని తెలియడంతో శిశు సంక్షేమ, పోలీసు అధికారులు వచ్చి వరుడు సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. వరుడిని అరెస్ట్ (Groom Arrested) చేశారు.
Here's Update
"Umapathy, a resident of Kolar district married two brides at the same time According to his family, he sought to marry a younger sibling but the latter's condition was that she would marry him only if he marries her elder sister too who was a dumb and deaf person @AARathod10007 pic.twitter.com/XkXHc1qDBK
— Mahesh Chawan (@MaheshChawan14) May 16, 2021
2019 లో కూడా ఇదే విధమైన కేసు వెలుగులోకి వచ్చింది, ఇందులో మధ్యప్రదేశ్ యొక్క భింద్ జిల్లాలో జరిగిన ఒకే వివాహ వేడుకలో ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. అందరినీ షాక్కు గురిచేసి, 35 ఏళ్ల వ్యక్తి తన భార్యను తిరిగి వివాహం చేసుకున్నాడు, ఆపై అదే వివాహ వేడుకలో తన బంధువుకు కూడా తాళి కట్టాడు. అయితే బిగామి హిందూ వివాహ చట్టం ప్రకారం అది నేరం. మీరు మీ మొదటి భార్యను విడాకులు తీసుకోకపోతే, రెండవ వివాహం చట్టబద్ధంగా పరిగణించబడదు.
(The above story first appeared on LatestLY on May 17, 2021 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

