Tamil Nadu: పొరపాటున ఆలయ హుండీలో జారిపడిన ఐఫోన్, ఆరు నెలల తర్వాత వేలం పాటలో రూ. 10 వేలకు దక్కించుకున్న అసలైన యజమని
ఆరు నెలల క్రితం దినేష్ తన కుటుంబ సమేతంగా మదురై సమీపంలోని తిరుప్పోరూరు కందసామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయితే హుండీలో కానుకలు వేస్తుండగా చొక్కా జేబులో పెట్టుకున్న ఫోన్ పొరపాటున జారి హుండీలో పడిపోయింది.
Chennai, Jan 10: డిపార్ట్మెంట్ ఆఫ్ హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ (హెచ్ఆర్ అండ్ సిఇ) ఐఫోన్ను వేలం వేయగా 10,000 రూపాయలకు ఆ ఫోన్ను దక్కించుకున్నాడు అసలైన యజమాని. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నిర్వహించిన ఐఫోన్ను వేలంపాటలో ఉంచి, కొన్ని నెలల క్రితం తిరుపోరూర్లోని అరుళ్మిగు కందస్వామి ఆలయంలోని హుండీలో ప్రమాదవశాత్తూ పడిన వినాయగపురంకు చెందిన దినేష్ను వేలంపాటకు అనుమతించినట్లు అధికారులు తెలిపారు.
ఆరు నెలల క్రితం దినేష్ తన కుటుంబ సమేతంగా మదురై సమీపంలోని తిరుప్పోరూరు కందసామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయితే హుండీలో కానుకలు వేస్తుండగా చొక్కా జేబులో పెట్టుకున్న ఫోన్ పొరపాటున జారి హుండీలో పడిపోయింది. ఫోన్ను తిరిగి పొందాలని కోరుతూ ఆలయ అధికారులను సంప్రదించగా, డిసెంబర్ 19న హుండీని లెక్కింపు కోసం తెరిచినప్పుడు తిరిగి రావాలని కోరారు.ఫోన్ దొరికినప్పటికీ, హుండీలో దొరికినవి దేవుడికే చెందుతాయని ఆలయ సంప్రదాయాన్ని పేర్కొంటూ అధికారులు దానిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.చివరకు ఆ ఫోన్లో ఉన్న సిమ్కార్డ్, మెమరీ కార్డు మాత్రమే ఆలయ నిర్వాహకులు తిరిగిచ్చారు.
ఈ విషయం దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బావు జోక్యం చేసుకోవడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది.రెండు రోజుల క్రితం, గాడ్జెట్ను నిజమైన యజమానికి తిరిగి ఇచ్చే విధానాన్ని శాఖ ప్రారంభించిందని మంత్రి చెప్పారు. హుండీలో పడిన వస్తువులను వేలం వేయాలనే ఆలయ నిబంధన ప్రకారమే దినేష్(Dinesh) ఐఫోన్కు ఆలయ నిర్వాహకులు వేలం పాడారు. దినేష్ ఆ వేలం పాటలో పాల్గొని రూ.10వేలకు తన ఐఫోన్ని తిరిగి దక్కించుకున్నాడు.
(The above story first appeared on LatestLY on Aug 18, 3569 05:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

