Heart Stroke: పాటలు పాడుతూ గాయకుడు.. గర్భా నృత్యం చేస్తూ యువకుడి మృతి.. దసరా ఉత్సవాల వేళ.. ఒడిశా, మహారాష్ట్రలో విషాద ఘటనలు
Singer (Photo: OTV)

Mumbai, October 4: దసరా ఉత్సవాల్లో (Dasara Celebrations) భాగంగా ఒడిశాలోని (Odisha) జయపురంలోని జగత్ జనని ఆలయంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విషాదాంతమైంది. ఈ  విభావరిలో మురళీ ప్రసాద్ మహాపాత్రా  (59) అనే గాయకుడు (Singer) రెండు పాటలు పాడారు. ఆపై విశ్రాంతి తీసుకుంటూ ఇతర  ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు, కళకారులు, శ్రోతలు వెంటనే ఆయనను  ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కోరాపుఠ్ జిల్లాకు చెందిన మురళి ‘ఖోకా భాయ్’గా అందరికీ సుపరిచితం. మురళీ ప్రసాద్ గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతోపాటు మధుమేహంతో బాధపడుతున్నట్టు ఆయన సోదరుడు  బిభూతి ప్రసాద్ మహాపాత్రా తెలిపారు.

గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు వివాదాస్పదం.. అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల చర్య.. కళాకారులు ఆగ్రహం

కాగా, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్ పట్టణంలో జరిగిన మరో ఘటనలో మనీశ్ నర్జాపీ (35) గర్భా నృత్యం (Garba Dance) చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు.  కుమారుడి మరణవార్త విన్న మనీశ్ తండ్రి సోనిగ్రా ఆసుపత్రిలో కుప్పకూలి మరణించారు. అయితే, వీరి మరణానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం వారి మృతికి కారణం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.