Pawan (Credits: Janasena Social Media)

Vizag, Nov 13: జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిన్న సాయంత్రం విశాఖ (Vizag) రుషికొండ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక బీచ్ (Beach) కు వెళ్లారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు. వారి జీవనవిధానం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఓ డ్రోన్ కూడా పవన్ కల్యాణ్ బీచ్ విహారాన్ని కవర్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో (Social Media) పంచుకుంది. పవన్ అభిమానులు, జనసైనికులు ఈ ఫొటోలపై విశేషంగా స్పందిస్తున్నారు.