Crisil Report: మాంసాహార భోజనం ధర తగ్గితే, శాకాహార భోజ‌నం ధ‌ర‌లు పెరిగాయి.. క్రిసిల్ తాజా నివేదిక‌

శాకాహార భోజ‌నం స‌గ‌టు ధ‌ర జూన్‌ లో 10 శాతం పెరిగిన‌ట్లు క్రిసిల్ వెల్ల‌డించింది. ఇదే సమయంలో మాంసాహార భోజనం ధర తగ్గినట్టు వివరించింది.

Crisil Report: మాంసాహార భోజనం ధర తగ్గితే, శాకాహార భోజ‌నం ధ‌ర‌లు పెరిగాయి.. క్రిసిల్ తాజా నివేదిక‌
Veg, Non-Veg Meals (Credits: X)

Newdelhi, July 6: శాకాహార భోజ‌నం (Veg Thali) స‌గ‌టు ధ‌ర జూన్‌ లో 10 శాతం పెరిగిన‌ట్లు క్రిసిల్ నివేదిక (Crisil Report) వెల్ల‌డించింది. ఇదే సమయంలో మాంసాహార భోజనం (Non Veg Meals) ధర తగ్గినట్టు వివరించింది. చికెన్‌ ధర తగ్గడం మాంసాహార భోజనం ధర తగ్గడానికి దోహదపడిందని తెలిపింది. వెజ్ థాలీ ప్లేట్ స‌గ‌టు ధ‌ర 2023 జూన్‌ లో రూ. 26.70 కాగా, ఈ ఏడాది జూన్‌ లో రూ. 29.40కు పెరిగింది. 2024 మేలో ఇది రూ. 27.80గా ఉంది. ఉల్లి, ట‌మాటా, బంగాళ‌దుంప‌లు, బియ్యం, ప‌ప్పుల ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే శాఖాహారం థాలీ ధరలు పెరగడానికి కార‌ణంగా నివేదిక పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?

నాన్ వెజ్ ఇలా..

చికెన్ రేటు 14 శాతం త‌గ్గ‌డంతో నాన్ వెజ్ థాలీ ఈ జూన్‌ లో రూ. 58కి దిగివ‌చ్చింది. గ‌తేడాది జూన్‌ లో ఇది రూ. 60.50గా ఉంది.

స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌, అల్యూమినియం వంట పాత్రలకు ఐఎస్‌ఐ గుర్తు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

(The above story first appeared on LatestLY on Jul 06, 2024 10:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).