Amitabh Bachchan Buys Land In Ayodhya: అయోధ్యలో రూ.14.5 కోట్లకు భూమిని కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్, రామ మందిరానికి 15 నిమిషాల దూరంలో..

అయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. 10 వేల చదరపు అడుగుల భూమిని రూ.14.5 కోట్లకు అమితాబ్ కొనుగోలు చేశారు.

Amitabh Bachchan Buys Land In Ayodhya: అయోధ్యలో రూ.14.5 కోట్లకు భూమిని కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్, రామ మందిరానికి 15 నిమిషాల దూరంలో..
Amitabh Bachchan (Photo Credits: Instagram)

అయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. 10 వేల చదరపు అడుగుల భూమిని రూ.14.5 కోట్లకు అమితాబ్ కొనుగోలు చేశారు.

‘తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగిన అయోధ్యలో భూమి కొనుగోలు చేశా. అయోధ్యలో ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద భౌగోళిక సరిహద్దులను దాటి భావొద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుంది. అయోధ్య ఆత్మలోకి ప్రయాణం ప్రారంభమైంది. సంప్రదాయం, ఆధునికత కలిగిన నగరంలోకి అడుగిడాను. ప్రపంచ ఆధ్మాత్మిక రాజధానిలో ఇల్లు నిర్మించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అమితాబ్ బచ్చన్ తెలిపారు

అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భూమి రామ మందిరానికి 15 నిమిషాల దూరంలో ఉంటుంది. ఇక్కడినుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 30 నిమిషాల సమయం పడుతుంది. అయోధ్యలో అమితాబ్ భూమి కొనుగోలు చేయడంతో ప్రాజెక్ట్‌కు మరింత పేరు వస్తుందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Here's News

 

View this post on Instagram

 

A post shared by Hindustan Times (@hindustantimes)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 15, 2024 04:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).