సూపర్ స్టార్ కృష్ణ అస్థికులను ఆయన తనయుడు, సినీ నటుడు మహేష్ బాబు కృష్ణానది, ధర్మ నిలయంలో కలపనున్నారు. ఈ మేరకు మహేష్ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెంట టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు. భారీ బందోబస్తు నడుమ వారు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ కృష్ణా నదికి బయలుదేరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)