సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫ‌లితాల‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో 94.40 శాతం విద్యార్థులు పాస‌య్యారు. అయితే టెన్త్‌లో అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే రాణించారు. ఇవాళ సీబీఎస్ఈ బోర్డు తొలిసారి ఒకే రోజు టెన్త్‌, 12 త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను రిలీజ్ చేసింది. 10వ త‌ర‌గ‌తిలో అమ్మాయిలు 95.21 శాతం పాస‌య్యారు. అబ్బాయిలు 93.80 శాతం పాసైన‌ట్లు బోర్డు తెలిపింది. సుమారు 64,908 మంది విద్యార్థులు 95 శాతం క‌న్నా ఎక్కువ మార్క్‌లు స్కోర్ చేశారు. 2.36 ల‌క్ష‌ల మంది విద్యార్థులు 90 శాతం క‌న్నా ఎక్కువ మార్క్‌లు స్కోర్ చేశారు. 1,07,689 మంది విద్యార్థులు కాంపార్ట్‌మెంట్‌లో ఉండిపోయారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)