Monsoon Rains: రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు
ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి నైరుతి రుతుపవన సీజన్ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
Newdelhi, Apr 16: ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) (IMD) రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి నైరుతి రుతుపవన (Monsoon Season) సీజన్ లో సాధారణం కంటే అధిక వర్షపాతం (Rains) నమోదవుతుందని అంచనా వేసింది. ఆగస్టు-సెప్టెంబరు నాటికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి తెలిపారు. ప్రైవేటు వాతావరణ సంస్థ సైమెట్ కూడా రుతుపవనాల సీజన్ వర్షాలపై ఇటీవల ఇలాంటి అంచనాలనే వెల్లడించింది.
In what could come as a relief to the govt's fight against inflation, the #IMD predicted an 'above normal' monsoon in 2024, which quantitatively could be around 106% of the LPA.@sanjeebm77 #monsoon2024 #inflation #IndianEconomyhttps://t.co/ua0oeTXPzK
— Business Standard (@bsindia) April 16, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 16, 2024 08:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

