Karnataka Road Accident: ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన లారీ, ఏడుమంది మృతి, 26 మందికి గాయాలు, హుబ్లీ -ధర్వాడ్లో పుణే – బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో ఏడు మంది దుర్మరణం పాలవగా.. 26 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ -ధర్వాడ్లో పుణే – బెంగళూరు హైవేపై తారిహా బైపాస్ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. కొల్లాపూర్ నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ, ఓ ప్రైవేట్ ట్రావెల్కు చెందిన బస్సు ఢీకొట్టుకున్నాయి.
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో ఏడు మంది దుర్మరణం పాలవగా.. 26 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ -ధర్వాడ్లో పుణే – బెంగళూరు హైవేపై తారిహా బైపాస్ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. కొల్లాపూర్ నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ, ఓ ప్రైవేట్ ట్రావెల్కు చెందిన బస్సు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనిర్తో పాటు మరో వ్యక్తి, బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుంబీలోని ఆసుప్రతికి క్షతగాత్రులను తరలించారు. 26 మంది బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను హుబ్లీ కమిషనర్ పరామర్శించారు.
7 dead, 26 injured in road accident in Karnataka's Hubli
Read @ANI Story | https://t.co/G1JyKtT0eq#Karnataka #Hubli pic.twitter.com/zpjzWTcqIF
— ANI Digital (@ani_digital) May 24, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 24, 2022 11:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

