Kumbh Mela Holy Dip For Pisoners:ఖైదీలకూ కుంభమేళా పుణ్యస్నానాలు.. 90 వేల మంది ఖైదీలు పవిత్ర పుణ్యస్నానం, వివరాలివే
మహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండగా పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
మహా కుంభమేళాకు(Maha Kumbh 2025) భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండగా పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక కుంభమేళా నేపథ్యంలో యూపీ ప్రభుత్వం(UP Govt) కీలక నిర్ణయం తీసుకుంది.
ఖైదీలకూ కుంభమేళా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించింది(Kumbh Mela Holy Dip For Pisoners). యూపీలోని 75 జైళ్లలో(Uttar Pradesh Jails) ఉన్న 90,000 మంది ఖైదీలకు పుణ్యస్నానం చేసే అవకాశాన్ని కల్పించింది. ప్రయాగ్ రాజ్(Prayagraj) లోని త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాలను ట్యాంకర్ల ద్వారా రాష్ట్రంలోని జైళ్లకు తరలించి, అక్కడి నీటి ట్యాంకుల్లో కలిపారు అధికారులు.
పుణ్యస్నానం అనంతరం ఖైదీలు పూజలు, ఇతర క్రతువులు నిర్వహించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకు మహా కుంభమేళాలో 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 20, 2025 11:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

