మ‌హారాష్ట్ర‌కు చెందిన పారిశ్రామికవేత్త‌పై నిర్వ‌హించిన ఐటీ దాడుల్లో రూ 390 కోట్ల విలువైన అక్ర‌మాస్తుల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జ‌ల్నా, ఔరంగాబాద్ న‌గ‌రాల్లో పారిశ్రామిక‌వేత్త‌కు చెందిన ఇండ్లు, కార్యాల‌యాల‌పై ఆగ‌స్ట్ 1 నుంచి 8 వ‌ర‌కూ ఐటీ అధికారులు దాడులు చేప‌ట్టారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో రూ 58 కోట్ల లెక్క తేల‌ని న‌గ‌దుతో పాటు 32 కిలోల బంగారం ఉంద‌ని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన న‌గ‌దును లెక్కించేందుకు అధికారుల‌కు 13 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. 260 మంది అధికారులు, ప‌లువురు సిబ్బంది ఈ దాడుల్లో పాలుపంచుకున్నారు. అధికారులు, సిబ్బంది ఐదు బృందాలుగా విడిపోయి దాడులు చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)