Odisha Accident: మద్యం మత్తులో బస్సును నడిపిన డ్రైవర్, బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో 5 మంది మృతి, మరో 38 మందికి తీవ్ర గాయాలు, విషాదకర వీడియో ఇదిగో..

ఒడిశా (Odisha)లోని బజ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జజ్‌పుర్‌ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు.

Odisha Accident: మద్యం మత్తులో బస్సును నడిపిన డ్రైవర్, బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో 5 మంది మృతి, మరో 38 మందికి తీవ్ర గాయాలు, విషాదకర వీడియో ఇదిగో..
Bus Accident

ఒడిశా (Odisha)లోని బజ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జజ్‌పుర్‌ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీకి తరలించారు. జీలం నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, పలువురు గల్లంతు, సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు

కటక్‌ నుంచి బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. బస్సులో 50 మంది ఉన్నారని తెలిపారు. మద్యం మత్తులో బస్సును నడపడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 16, 2024 01:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).