Jharkhand: కరెంటు పోల్ నిలబెడుతుండగా ఆరుమందికి విద్యుత్ షాక్, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కూలీలు, జార్ఖండ్లో విషాదకర ఘటన
జార్ఖండ్లో కరెంటు పోల్ నిలబెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేకు చెందిన ధన్బాద్ డివిజన్ పరిధిలోని నిచిత్పూర్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
జార్ఖండ్లో కరెంటు పోల్ నిలబెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేకు చెందిన ధన్బాద్ డివిజన్ పరిధిలోని నిచిత్పూర్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE) పోల్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు పలువురికి విద్యుత్ షాక్ తగిలిందని, వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని రైల్వే అధికారులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన విద్యుత్ శాఖ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. రైల్వే అధికారుల ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ANI Tweet
Dhanbad, Jharkhand | Six people died due to electrocution at Nichitpur railway crossing under Dhanbad division of Eastern Central Railway. The incident took place during the installation of an overhead electric (OHE) pole: Railway officials
— ANI (@ANI) May 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 29, 2023 04:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

