కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర్ తాలూకాలో ప్రత్యేక వికలాంగురాలైన బామ్మకి జీవనాధారమైన పింఛను డబ్బు 2నెలలుగా రాలేదు. అడిగితే పోస్టుమాన్ విసుక్కుంటున్నాడు. దీంతో రోడ్డుపై దేకుతూ 8 గంటల పాటు ప్రయాణించి 2 కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసుకు చేరుకుందా పెద్దావిడ. దాని వల్ల కాళ్లంతా గాయాలయ్యాయి. సంతానం లేని గిరిజమ్మ అనే వృద్ధ మహిళ (77) ఫించను మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా పోస్టాఫీస్ ద్వారా ఆమెకు పెన్సన్ వస్తుండగా 2023 నవంబర్ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆగిపోయాయని గిరిజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)