Cockroach Found in Meal on Train: వందేభారత్ రైలు భోజనంలో చచ్చిన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన ప్యాసింజర్, రైల్వే శాఖ రెస్పాన్స్ ఏంటంటే..

వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.

Cockroach Found in Meal on Train: వందేభారత్ రైలు భోజనంలో చచ్చిన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన ప్యాసింజర్, రైల్వే శాఖ రెస్పాన్స్ ఏంటంటే..
Cockroach Found In Meal Served On Vande Bharat Train (Photo/x/@iamdrkeshari)

Cockroach Found In Meal Served On Vande Bharat Train: వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీన రాణి కమలాపతి నుంచి జబల్ పూర్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక కనిపించడంతో షాకయ్యాడు.

సుభేందు కేసరి అనే వ్యక్తి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తూ నాన్ వెజ్ మీల్ ఆర్డర్ పెట్టగా అందులో చనిపోయిన బొద్దింక కనిపించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రయాణికుడు భోజనానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ వెంటనే స్పందించింది. ప్రయాణికుడికి క్షమాపణలు కూడా చెప్పింది. అంతేకాకుండా సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌‌పై భారీ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. ఈ ఘటనపై రైల్వే సేవా స్పందిస్తూ రైల్ మదాద్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

Here's Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 06, 2024 05:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).