Electricity Bill Socker: కరెంటు బిల్లు విలువ రూ.4,950.. రూ.197 కోట్లు చెల్లించినట్టు కస్టమర్ కు రసీదు..!.. ఏంటా సంగతి??
కరెంటు బిల్లు చెల్లించినప్పుడు విద్యుత్ బిల్లు వసూలు చేసే ఉద్యోగి రశీదు ఇవ్వడం సాధారణమే. మనం ఎంత మొత్తమైతే బిల్లు చెల్లిస్తామో అంతే మొత్తానికి రసీదు ఇస్తారు.
Newdelhi, Dec 2: కరెంటు బిల్లు (Electricity Bill) చెల్లించినప్పుడు విద్యుత్ బిల్లు వసూలు చేసే ఉద్యోగి రశీదు ఇవ్వడం సాధారణమే. మనం ఎంత మొత్తమైతే బిల్లు (Bill) చెల్లిస్తామో అంతే మొత్తానికి రసీదు ఇస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గోరఖ్ పూర్ కు చెందిన చౌహారీ దేవి అనే ఓ మహిళా కస్టమర్ కు అందుకు భిన్నంగా బిల్లు వచ్చింది. ఆమె కుమారుడు రూ.4,950 బిల్లు చెల్లిస్తే.. బిల్లు తీసుకున్న ఉద్యోగి రసీదు మాత్రం రూ.197 కోట్లకు ఇచ్చాడు. వసూలైన నగదుకు, బిల్లులో ఉన్న మొత్తానికి కోట్లలో తేడా వచ్చినట్టు గుర్తించిన అధికారులు.. చౌహారీ దేవి అనే కస్టమర్కు రూ.197 కోట్లకు రసీదు ఇచ్చినట్లు గుర్తించారు. దాంతో ఆ బిల్లును డిలీట్ చేసి, రూ.4,950కి కొత్త రసీదును జనరేట్ చేసి ఆమెకు పంపించారు చౌహారి దేవి బిల్లు చెల్లించిన సమయంలో బిల్లు మొత్తాన్ని ఎంటర్ చేయాల్సిన దగ్గర బిల్లుకు బదులుగా ఆమె విద్యుత్ కనెక్షన్ నెంబర్ (197000)ను ఎంటర్చేశారు. ఆ నెంబర్ మొత్తం రూ.197 కోట్లకుపైన ఉన్నది. అందుకే లెక్కల్లో రూ.197 కోట్ల తేడా వచ్చింది.
Billing Blunder: Woman Receives Shocking Rs 197 Crore Electricity Payment Receipt https://t.co/i08qNRQ0zP To Get all latest news and updates Join us on WHATSAPP group https://t.co/9JQObwuDqx https://t.co/qw1Yd1y2B2
— News track English (@newstrack_eng) December 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 02, 2023 09:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

