Uttar Pradesh Horror: ఏసీ ఆన్ చేసి పడుకున్న డాక్టర్.. చలికి తట్టుకోలేక చనిపోయిన ఇద్దరు నవజాత శిశువులు.. ఉత్తరప్రదేశ్ లోని షామ్లిలో ఘటన
ఓ డాక్టర్ చేసిన నిర్వాకం కారణంగా ఆసుపత్రిలో చల్లదనాన్ని భరించలేక ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్లో జరిగిందీ ఘటన.
Newdelhi, Sep 25: ఓ డాక్టర్ (Doctor) చేసిన నిర్వాకం కారణంగా ఆసుపత్రిలో (Hospital) చల్లదనాన్ని భరించలేక ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్లో జరిగిందీ ఘటన. శనివారం రాత్రి నిద్రపోయే ముందు డాక్టర్ నీతూ గదిలోని ఏసీ పెంచారు. తెల్లారి చూస్తే శిశువులు ఇద్దరూ మృతి చెంది కనిపించినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నీతూను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. నిందితుడు దోషిగా తేలితే కఠిన చర్యలు తప్పవని అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వని శర్మ హెచ్చరించారు.
Uttar Pradesh Shocker: Two Newborns Die ‘Due to Cold’ in Private Clinic in Shamli District, Doctor Arrested; Inquiry Ordered#UttarPradesh #NewbornsDie #Shamli #PrivateClinic https://t.co/CO9IIARarZ
— LatestLY (@latestly) September 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 25, 2023 10:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

