Paris, Aug 3:  పారిస్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి సెమీస్ ఛాన్స్ మిస్ చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్స్‌ లో దక్షిణ కొరియాకు చెందిన నమ్ సుహేయున్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్ మెడల్ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకుంది.

ఇక అంతకముందు ప్రీక్వార్టర్ ఫైనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో దీపికా కుమారి 6-4 తేడాతో జర్మనీకి చెందిన మైకేల్ గ్రోపెన్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌కు చెందిన మరో ఆర్చర్ భజన్ కౌర్ తీవ్రంగా పోరాడి ప్రీక్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో ఓడిపోయింది.

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)