ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పుంజుకుంది. గత కొన్నిరోజులుగా 500కి పైబడి కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 37,849 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 840 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 183 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 150 కేసులను గుర్తించారు. అదే సమయంలో 133 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,79,763 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,62,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,972 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,501కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)