Andhra Pradesh: వీడియో ఇదిగో, నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కి'లేడీ'లు, నిజం తెలిసి తల పట్టుకున్న షాపు యజమాని
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో గురువారం ఉదయం 32 గ్రాముల నకిలీ బంగారపు గొలుసు ఇచ్చి.. కమ్మలు, తాళిబొట్టు తీసుకున్నారు.
అయితే జ్యుయెల్లరీ షాపు వాళ్లు అది అసలు బంగారం అని భావించి మోసపోయారు. ఆపై అది నకిలీ బంగారం అని తెలిసి తలపట్టుకున్నారు. దీంతో వెంటనే షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారి తెలివిని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కి'లేడీ'లు
నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కి'లేడీ'లు
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘటన
ఉదయం బంగారం షాపుకొచ్చిన ఇద్దరు మహిళలు
32 గ్రాముల నకిలీ బంగారం చైన్ ఇచ్చి.. కమ్మలు, తాళిబొట్టు తీసుకున్న మహిళలు
కిలేడీలు ఇచ్చింది నకిలీ బంగారం అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపు యజమాని pic.twitter.com/CbxEYEQgDR
— BIG TV Breaking News (@bigtvtelugu) February 20, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 20, 2025 07:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

