Jagananna Vidya Deevena: మరి కాసేపట్లో జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులు విడుదల, రూ.694 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ఏపీ సీఎం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరారు. నేడు జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ఉన్నారు. బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరారు. నేడు జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ఉన్నారు. బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
జగనన్న విద్యాదీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.. క్రమం తప్పకుండా త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు ₹694 కోట్లను నేడే వారి తల్లుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.#JaganannaVidyaDeevena #CMYSJagan pic.twitter.com/kwbquXyld6
— YSRCP Digital Media (@YSRCPDMO) August 11, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 11, 2022 10:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

