ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్‌ లిఫ్టులో చిక్కుకున్నారు ప్రయాణికులు(Passengers trapped). 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన అనుభవించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్‌లో(railway station elevator) ఈ ఘటన జరిగింది.

ప్లాట్‌ఫారం మారేందుకు 14 మంది లిఫ్టు ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్టు ఆగిపోవడంతో పాటు తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు 3 గంటల పాటు అందులో ఇబ్బందులు పడ్డారు. వారి కేకలు విని రైల్వే పోలీసులు(Railway Police) స్పందించారు. టెక్నీషియన్లు లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఓ యువకుడు దాడి చేశాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం దగ్గర ఇవాళ ఉదయం ట్రాక్టర్ తో ఓ యువకుడు హడావుడి చేశాడు. ర్యాంపు పై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్ తో ధ్వంసం చేశాడు. వైసీపీ నేత ముద్రగడ ఇంటిపై దాడి.. ట్రాక్టర్‌తో కార్లు ధ్వంసం చేసిన యువకుడు 

Passengers Trapped in Railway Station Lift Endure 3 Hours of Ordeal

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)