హైదరాబాద్‌లో ప్రముఖ చాట్‘గోకుల్ చాట్’ యజమాని ముకుంద్ దాస్ నిన్న మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోకుల్‌ చాట్‌ను ఆయన 1996లో ప్రారంభించారు.కాగా 2007 ఆగస్టు 25న ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలిన సంగతి విదితమే. చాట్ తింటూ ముచ్చట్లాడుకుంటున్న 33 మంది ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో స్నేహితులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)