Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఓవైసీకి నాంపల్లి కోర్టులో ఊరట, రెండు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం, ఓవైసీ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపలేదని పేర్కొన్న కోర్టు
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. నిజామాబాద్, నిర్మల్లో అక్బరుద్దీన్ మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై అప్పట్లో రెండు కేసులు నమోదయ్యాయి.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. నిజామాబాద్, నిర్మల్లో అక్బరుద్దీన్ మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై అప్పట్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడా ఆ కేసులను నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఓవైసీ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపలేదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్పై నమోదైన రెండు కేసులను కొట్టివేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
2012 డిసెంబర్లో నిజామాబాద్, నిర్మల్లో అక్బరుద్దీన్ పర్యటించిన సందర్భంగా ఆయన మతపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణను చేపట్టిన కోర్టు అనేక మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించింది.
Hyderabad | The special sessions court for MPs & MLAs acquitted AIMIM leader Akbaruddin Owaisi in two hate speech cases pertaining to Nirmal and Nizamabad district.
(File pic) pic.twitter.com/reCTM7intm
— ANI (@ANI) April 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 13, 2022 04:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

