మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథం కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్‌పూర్‌ మండలం మదిగట్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(52) తన కొడుకు, కోడలుతో కలిసి హస్తినాపురం సమీపంలోని అగ్రికల్చర్‌ కాలనీ వైపు వెళ్లారు.

అక్కడ తెలిసిన వారి దగ్గర డబ్బులు తీసుకొని.. తిరిగి చంపాపేటకు బయలుదేరారు. కొడుకు, కోడలు వేరే వాహనంపై వెళ్లారు. మరో ద్విచక్ర వాహనంపై ట్రిపుల్‌ రైడింగ్‌లో తెలిసిన వారితో కలిసి లక్ష్మమ్మ వెళ్తోంది. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ లక్ష్మమ్మ వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. వెనుక కూర్చున్న ఆమె కిందపడిపోయింది. టిప్పర్‌ ఆమె పైనుంచి వెళ్లడంతో మృతి చెందింది. మిగతా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)