TS Govt. Rs 500 LPG Scheme: తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికే రూ.500లకు గ్యాస్‌ బండ స్కీమ్‌?? లబ్దిదారుల ఎంపికపై తెలంగాణ సర్కారు కసరత్తు

ఎన్నికల హామీలను అమలు చేయడంపై తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయగా తాజాగా రూ.500లకే గ్యాస్ పంపిణీపై కసరత్తు మొదలుపెట్టింది.

TS Govt. Rs 500 LPG Scheme: తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికే రూ.500లకు గ్యాస్‌ బండ స్కీమ్‌?? లబ్దిదారుల ఎంపికపై తెలంగాణ సర్కారు కసరత్తు
Credits: Social Media

Hyderabad, Dec 24: ఎన్నికల హామీలను (Election Promises) అమలు చేయడంపై తెలంగాణలోని (Telangana) కాంగ్రెస్ సర్కారు (Congress Government) దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi Scheme) భాగంగా మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయగా తాజాగా రూ.500లకే గ్యాస్ పంపిణీపై కసరత్తు మొదలుపెట్టింది. గ్యాస్‌ సిలిండర్ పంపిణీకి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియపై విధివిధానాలను పరిశీలిస్తోంది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పౌరసరఫరాల శాఖ కీలక ప్రాతిపదనలు పంపించినట్టు సమాచారం. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా లబ్దిదారుల బయోమెట్రిక్‌‌ ను తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలో కలెక్టర్లతో ఆదివారం నిర్వహించనున్న సమీక్షలో ఈ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి.

Credits: Social Media

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 24, 2023 09:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).