MP Dharmapuri Arvind: కేసీఆర్‌ మానసిక పరిస్థితి దిగజారుతోంది, ఇకపై పరుష పదజాలంతో ఆయనను విమర్శించను, రాజకీయంగా, సాంకేతికంగానే సీఎంను విమర్శిస్తానని తెలిపిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

గత కొంతకాలంగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించబోనని స్పష్టంచేశారు. రాజకీయంగా, సాంకేతికంగానే కేసీఆర్‌ను విమర్శిస్తానని, ఇవి ఆవేదనతో చెబుతున్న మాటలని వ్యాఖ్యానించారు.

MP Dharmapuri Arvind: కేసీఆర్‌ మానసిక పరిస్థితి దిగజారుతోంది, ఇకపై పరుష పదజాలంతో ఆయనను విమర్శించను, రాజకీయంగా, సాంకేతికంగానే సీఎంను విమర్శిస్తానని తెలిపిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
Dharmapuri Arvind (Photo-Video Grab)

గత కొంతకాలంగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించబోనని స్పష్టంచేశారు. రాజకీయంగా, సాంకేతికంగానే కేసీఆర్‌ను విమర్శిస్తానని, ఇవి ఆవేదనతో చెబుతున్న మాటలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలతో బీజేపీ ఎదుగుదలను, దిగజారుతున్న టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ కారణంగానో లేక కుటుంబ వారసత్వ రాజకీయాల ఒత్తిడి కారణంగానో కేసీఆర్‌ మానసిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ ఇంట్లో వారసత్వ పోరు మొదలైందని తెలిపారు. శనివారం వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తెలంగాణపై విదేశాలు కుట్ర పన్ని క్లౌడ్‌ బరస్ట్‌ చేయడంతో వరదలు సంభవించాయని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధాకరమని అన్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 19, 2022 10:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).