తెలంగాణలో కరోనా కల్లోలం రేపుతోంది. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 2,295 మందికి పాజిటివ్ గా తేలింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 232, రంగారెడ్డి జిల్లాలో 218 కేసులు గుర్తించారు. అటు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 278 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,039కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,89,751 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,75,851 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఈ నేపథ్యంలో, యాక్టివ్ కేసుల సంఖ్య 9,861కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)