తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,213 శాంపిల్స్ పరీక్షించగా, 647 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 76, ఖమ్మం జిల్లాలో 58 కేసులు గుర్తించారు. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 1, నిర్మల్ జిల్లా 1 కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో 749 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,40,659 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,27,254 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,625 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,780కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)