తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈఓ) పోస్టు గ‌త కొంత కాలంగా ఖాళీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టిదాకా ఆ పోస్టులో కొన‌సాగిన శ‌శాంక్ గోయ‌ల్ ఇదివ‌ర‌కే బ‌దిలీ కాగా.. తాజాగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ రాష్ట్రఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా నియ‌మిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ రాజ్‌.. ఉమ్మ‌డి ఏపీలో క‌ర్నూలు క‌లెక్టర్‌గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఎండీగా కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ కేడ‌ర్‌ను ఎంచుకున్న ఆయ‌న ఇన్నాళ్లూ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ (జీఏడీ) ముఖ్య కార్య‌ద‌ర్శిగా కొన‌సాగారు.

Vikas Raj appointed the New CEO of Telangana

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)