Vikram Soft Landing: సాఫ్ట్ ల్యాండింగ్ లో ‘దుమ్ము’ రేపిన ల్యాండర్ విక్రమ్.. పైకి లేచిన 2 టన్నుల మట్టి.. ఇస్రో వెల్లడి
చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో పంపిన చంద్రయాన్-3 నిజంగానే ‘దుమ్ము’రేపింది.
Newdelhi, Oct 28: చంద్రుడిపై (Moon) పరిశోధనల నిమిత్తం ఇస్రో (ISRO) పంపిన చంద్రయాన్-3 (Chandrayaan 3) నిజంగానే ‘దుమ్ము’రేపింది. ఆగస్టు 23న ల్యాండర్ విక్రమ్ (Lander Vikram) జాబిల్లి పై అడుగుపెట్టే క్రమంలో శివశక్తి పాయింట్ వద్ద పెద్ద మొత్తంలో దుమ్ము, ధూళి, చిన్న చిన్న రాళ్లు పైకిలేచాయని, దాదాపు 2.06 టన్నులమేర మట్టి 108 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్థానభ్రంశం చెందినట్టు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. దీనికి సంబంధించి తాజా వివరాల్ని ఇస్రో ‘ఎక్స్’లో విడుదల చేసింది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుడి పైపొరలోని పదార్థాలు (దుమ్ముధూళి, ఖనిజ, రాళ్ల శకలాలు వంటివి) పక్కకు జరిగినట్టు తెలిపింది. విక్రమ్ ల్యాండర్ చుట్టూ ఆ పదార్థాలతో భారీ వలయాకార పరిధి ఏర్పడినట్టు ఇస్రో పేర్కొన్నది.
#ISRO announced on Friday that the #Chandrayaan3 mission's lander module, Vikram, displaced approximately 2.06 tonnes of lunar regolith (rocks & soil) during its historic landing on the Moon's surface#ValmikiJayanti #PAKvSA #India #HamasislSIS #PKMKBForever #70hours #AUSvsNZ https://t.co/ByyYLgQ55s
— ISRO Space News (@ISRO_SpaceNews) October 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 28, 2023 09:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

