Israel-Hamas War: హమాస్ మిలిటెంట్లు ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, గాజాలో 25 వేలు దాటిన మృతుల సంఖ్య
హమాస్ మిలిటెంట్లను ఏరివేతే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది.మూడున్నర నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 62 వేల మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, మైనర్లు ఉన్నారు
హమాస్ మిలిటెంట్లను ఏరివేతే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది.మూడున్నర నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 62 వేల మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, మైనర్లు ఉన్నారు. గత 24 గంటల వ్యవధిలో 178 మంది మరణించగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం అధికార ప్రతినిధి అష్రాఫ్ అల్-కిద్రా పేర్కొన్నారు. చనిపోయిన వారిలో హమాస్ మిలిటెంట్లు, సాధారణ పౌరులు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు.
కాగా ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు గత ఏడాది అక్టోబరు 7న విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 1,200 మంది ఇజ్రాయెలీయులు మరణించారు. దీనికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది.
Here's News
The Palestinian death toll in Israel’s war on Gaza has surpassed 25,000, according to the Ministry of Health in the besieged enclave. https://t.co/bo13VrQPwS
— Al Jazeera English (@AJEnglish) January 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 22, 2024 02:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

